Tuesday, July 28, 2020

తిరుపతిలో నిశ్శబ్దం, కొరోనాలాంటి నిర్బంధం

15వ శతాబ్దిలో , శ్రీ అన్నమాచార్య  కాలంలో కూడా , ప్రస్తుతం మనమందరం  అనుభవిస్తున్న  “లాక్డౌన్ ” లాంటి  పరిస్థితియే  వచ్చిందని, ఈ క్రింది సంకీర్తనలో  చెప్పబడియున్నది .....   లొక్డౌన్  అంటే  నిర్బంధమ్ . ఒక్క నిర్బంధమే  కాదు, మొత్తం తిరుపతిలో  నిశ్శబ్దం కూడా  పాటించబడిందట.

శ్రీ వేంకటేశ్వరుని గుడికి తాళం వేసి , సీలు వేసి చాలా రోజులు మూసి వుంచారట.  పేనిన తాళ్లతో  ద్వారాన్ని కట్టి బిగించినట్లు ఈ సంకీర్తనలో  అన్నమయ్య చెప్పారు. ( 15వ సంపుటం118 సంకీర్తన )

“ ఓ హోహో  యనరో  పారి , సాహసాన  తిరుగరో  జంట పారి “

“కోనేటిరాయడు  కోరి  నిద్రించీ  వాడే , ఆనకమై  జాలీయరో  అండు బారీ ,

పేనిపట్టి  వాకిళ్ళ  బీగముద్ర లాయ నిడి , కానిమ్మని  వాయించరో  గంటపారీ “.  


  “”అంటే , సీలు వేసి , చాలా రోజులు  గుడిని  మూసి వేయడం జరిగినది, కారణం     ఏంటి? ? ఆ శ్రీనివాసుడు  నిద్ర  కోరుతున్నాడట . 

     “ శ్రీవేంకటేశ్వరుడు.  చిత్తగించీ  లోననదే , కోవరమెన్నికరో  కోటి  పారి 
 ఆవల   బంగారు  గుదియలు  ఘల్లు  రనగ , తావు హనుమంతుని  తలారి  పారి “  ".      
    
ఎదో ఒక  విషమ పరిస్థితి, ఒక విషపూరిత వాతావరణం , జనానికి ఆపదకలిగించేది  ఏర్పడివుండివుంటుంది.  బయట జనంతో  కలిసి  తిరగడం  ఒక ప్రమాదకారణమైన  పరిస్థితి  , తయారై  ఉండిఉండవచ్చుఁగాబోలు!  అందుకే,    అన్నమయ్య  , తిరుపతి  జనులనుద్దేశించి,  ఈ  సంకీర్తనద్వారా  , అందరిని  జాగరూకులై  ఉండమని  “హెచ్చ్చరిక   “  చేస్తున్నారు.    

ఇది ఆధునిక  కాలం,  అది  అన్నమయ్య కాలం . 

ఆధ్యాత్మికత  అంతస్థులలోనున్న కాలం. కాలాలు  వేరే  కావచ్చ్చేమో  గానీ, గమనికలు - జాగ్రత్తలు , అప్పుడూ ఇప్పుడూ  ఒక్కటే.       

   కవులు గాయకులూ , ఆధ్యాతిక వేత్తలూ , అపార భక్తులున్న  ఆ     రోజుల్లో  నేయినా , ఈ రోజుల్లోనైనా , అవే  నిబంధనలూ,    నిర్బంధాలూ . చరిత్రలో  నిలిచిపోయే  నిజాలివి   

                                                                                                                                              
ఓహోహో అనరో  పారి , సాహసాన తిరుగరో  జంట పారి"

ధైర్యముంటే , బయట తిరగండి. అదీ , విడివిడిగా, కానీ , జంటగా కాదు.

         “ కోనేటి రాయడు కోరి నిదురించీ వాడే, ఆనక మై  జాలీయారో  అందు బారి   

       పేనిపెట్టి   వాకిళ్ళ  బీగ ముద్రలాయనిడి , కానిమ్మని  వాయించరో  గంట  పార

          “ తిరుపణి  మడగెను , తిరుగరాదెవ్వరికి , మరల నెలుగియ్యరో  మగపారి    పరగ  దేవతలెల్లా  బడకెళ మున్నారు , ఇరవాయ  సూర్యచంద్రు లెదురు  పారి      

  తిరుపతి మొత్తం  నిశ్శబ్దాన్ని  పాటించింది.   దేవతలూ విశ్రాంతి లోనున్నారు .  సూర్యుడు  చంద్రుడు  ఎదురెదురుగా  నిలిచినట్టి , ఒకానొక  గ్రహణ గ్రహ స్థితి ,   గోచరించింది. అది ఏలాంటి పరిస్థితి?ఎంత  విషమ పరిస్థితి  అవ్వకుంటే, ప్రజలు    ఇంటిలోనే , ఉండిపోవలసి వచ్చిందట . ఎవ్వరూ  బయట తిరురాదన్న  ఒక నిర్బంధస్థితి  తప్పనిసరి  అయ్యింది . ప్రతుతం , మనముంటున్న పరిస్థితియే. 

 అందరి  కోరికలు  ఆ వేంకటేశుడు , లోనుండి యే  తప్పక  వింటున్నాడు,  కావున , కోటి కోరికలైనా కోవెల వాకిటనే  నిలిచి , కోరుకొమ్మంటున్నారు. కోరిన కోర్కెల కొంగుపైడి  ఐన కోనేటి రాయడు, నిద్రించ కోరాడట . అందుకే ఆ నిశ్శబ్దం,  నిర్బంధం తిరుపతి  పాటించింది  .. ఇలాంటి  పరిస్థితులలో  , ఎవ్వరైనా  ఉఫ్  అంటారేగాని, ఓహోహో  అని అంటారేగానీ ,,అహహా  అని అనరుగదా!!!

 

  

No comments:

Post a Comment

తిరుపతిలో నిశ్శబ్దం, కొరోనాలాంటి నిర్బంధం

15వ శతాబ్దిలో , శ్రీ అన్నమాచార్య  కాలంలో కూడా , ప్రస్తుతం మనమందరం  అనుభవిస్తున్న  “లాక్డౌన్ ” లాంటి  పరిస్థితియే  వచ్చిందని, ఈ క్రింది సంక...